PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ పార్టీ వీడే ప్రసక్తే లేదు…

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: వైసీపీ ప్రభుత్వాన్ని వీడే ప్రసక్తే లేదని జడ్పిటిసి బోరెడ్డి శ్రీరామిరెడ్డి, ఏపీఐఐసి డైరెక్టర్ బోరెడ్డిపుల్లారెడ్డి, డోన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా నారాయణమూర్తి, మండల వ్యవసాయ సలహా చైర్మన్ మెట్టు వెంకటేశ్వర రెడ్డి, బోర మల్లికార్జున రెడ్డి,వైస్ ప్రెసిడెంట్ గడ్డం భూనేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు చిన్నపూజర్ల రామచంద్రారెడ్డి ,కంతం భాస్కర్ రెడ్డి  అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ప్యాపిలి పట్టణంలోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ  ప్రతిపక్షం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇటీవల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు.గత మూడు సంవత్సరాల క్రితం డోన్ నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డిని నియమించారు, ఈయనకు పార్టీ పైన ఎక్కువ అనుభవం లేదని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పై విజయం సాధించాలంటే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ని డోన్ నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు బరిలోకి దింపుతూ  నియమించారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కోట్ల సుజాతమ్మ దంపతులు గతంలో డోన్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వుంటు విజయం సాధించారు. ఇప్పుడు వున్నా వైసిపి నాయకులు కాంగ్రెస్ పార్టీ సేవలు అందించాము, కాని ‌వైసిపి పార్టీ వీడే ప్రసక్తే లేదు మాపై  గిట్టనివారు, తప్పుగా ప్రచారం చేస్తున్నారు. డోన్ నియోజకవర్గం లో బుగ్గన రాజేంద్రనాథరెడ్డిని ముచ్చటగా మూడోసారి అఖండ మెజార్టీతో గెలిపించుకొని బుగ్గనకు గిఫ్ట్ ఇస్తామని,  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకువెళ్లి వైసిపి పార్టీని బలోపేతం చేసి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి   అసెంబ్లీలో కూర్చోబెడతామని వారు దిమా వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు రాజ మురళి కృష్ణ, సింగల్ విండో అధ్యక్షుడు బోరెడ్డి రామచంద్రారెడ్డి, బాలయ్య బండ సోమశేఖర్,నేరేడు చేర్ల చంద్రశేఖర్ రెడ్డి, సిద్ధనగట్టు చంద్రశేఖర్ రెడ్డి, జంగం చంద్రశేఖర్, కొండయ్య, ఎర్రి స్వామి, హిమాముద్దీన్ తదితరులు వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author