PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్రమ కేసులు బనాయిస్తే భయపడే ప్రసక్తి లేదు

1 min read

– డోన్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ :  భవిష్యత్తుకు గ్యారంటీ (రచ్చబండ), ఓటర్ లిస్టు ప్రక్రియను చేపట్టాలని బూత్ ఇంచార్జులకు సూచించిన ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి శుక్రవారం డోన్ పట్టణంలో తెలుగుదేశంపార్టీ కార్యాలయం నందు డోన్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం డోన్ పట్టణ టిడిపి అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు , డోన్ మండలం టిడిపి అధ్యక్షులు సలీంద్ర శ్రీనివాసులు యాదవ్ , ప్యాపిలి మండలం టిడిపి అధ్యక్షులు గండికోట రామసుబ్బయ్య ,బేతంచేర్ల పట్టణ టిడిపి ప్రధాన కార్యదర్శి షేక్షావళి చౌదరి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గౌడ్ , డోన్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి ,రాష్ట్ర తెలుగుదేశంపార్టీ కార్యదర్శి వై.నాగేశ్వరావు యాదవ్ , రాష్ట్ర తెలుగుదేశంపార్టీ కార్యదర్శి వలసల రామకృష్ణ ,డోన్ నియోజకవర్గ టిడిపి అబ్జర్వర్ కమతం కాటమయ్య  హాజరయ్యారు.ఈ సమావేశంలో  ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి  మాట్లాడుతూ బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం 45 రోజుల పాటు ఉంటుందని, ఈ కార్యక్రమంలో క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు ట్రైనింగ్ ఇచ్చిన విధంగా పని చేయాలని అన్నారు. అంతేకాకుండా భవిష్యత్తుకు గ్యారంటీ లోని సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించి భరోసా ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా ఈ రెండు రోజుల్లో ఓటర్ లిస్టు వస్తుందని ఓటర్ లిస్టును సరిచేసుకోవాలి , అధికారపార్టీ నాయకులు ఎలాగైనా మళ్ళీ గెలవాలని ఓటర్ లిస్టు ద్వారా తప్పిదాలు చేస్తున్నారని అన్నారు. వైసిపి నాయకులు ఓటమి భయంతో అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని, అక్రమ కేసులు పెడితే ఇక్కడ ఎవరూ భయపడరని అన్నారు.వచ్చే ఎన్నికల్లో వైసిపికి తగిన గుణపాఠం చెప్తామని అన్నారు.ఈ కార్యక్రమంలోమాజీ ఎంపిపి ఆర్.ఈ.రాఘవేంద్ర , డోన్ నియోజకవర్గ టిడిపి సలహాదారుల కమిటీ అధ్యక్షులు మురళీకృష్ణ గౌడ్ , రాష్ట్ర తెలుగుదేశంపార్టీ ఎస్సీ అధికార ప్రతినిధి గంధం శ్రీనివాసులు, రాష్ట్ర తెలుగుదేశంపార్టీ క్రిష్టియన్ సెల్ కమిటీ నాయకులు మేకల నాగరాజు, నంద్యాల జిల్లా తెలుగుదేశంపార్టీ బీసీ సెల్ అధ్యక్షులు ప్రజావైద్యశాల బెస్తా మల్లిఖార్జున, ప్యాపిలి పట్టణ టిడిపి అధ్యక్షులు భూశెట్టి సుంకయ్య, పెద్దపూదేళ్ళ ప్రసాద్ రెడ్డి,నంద్యాల జిల్లా రైతు కమిటీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాజశేఖర్ రెడ్డి, డోన్ నియోజకవర్గ టిడిపి రైతు కమిటీ అధ్యక్షులు మల్లయ్య, డోన్ నియోజకవర్గ టిడిపి తెలుగుయువత అధ్యక్షులు కుమ్మరి సుధాకర్, అంకిరెడ్డి, జాకీరుల్ల బేగ్, ఎంఎస్, పట్టణ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రఫీ, క్లస్టర్ ఇంచార్జ్ బుగ్గనపల్లె రమేష్, ప్యాపిలి మండలం టిడిపి ప్రధాన కార్యదర్శి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

About Author