NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అక్కడ టీడీపీ, కాంగ్రెస్ కలిసి పోటీ !

1 min read

పల్లెవెలుగువెబ్ : కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల్లో టీడీపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి. మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీ చేయనున్నట్టు ఏఎన్టీసీసీ అధ్యక్షుడు రంగలాల్ హల్దార్, టీడీపీ స్థానిక అధ్యక్షుడు మాణిక్యరావు యాదవ్ పోర్ట్ బ్లయర్ లో సమావేశమైన నిర్ణయం తీసుకున్నారు. అండమాన్ అభివృద్ధి, ప్రజాస్వామ్యయుత పాలన కోసం ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించినట్టు రంగలాల్ తెలిపారు. పోర్ట్ బ్లయర్ మున్సిపాలిటీలో 2,5,16 వార్డుల్లో టీడీపీ పోటీ చేయనుంది. మార్చి 6న పోలింగ్, 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.

               

About Author