PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్మ‌గ్లింగ్ కోస‌మే అదానీకి క‌ట్ట‌బెడుతున్నారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశద్రోహం చట్టం మార్చాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆదివారం ఆయన రాజ‌మండ్రిలో మీడియాతో మాట్లాడుతూ కోర్టు ధిక్కరణకు పాల్పడేవారిలో సీఎం జగన్‌, తెలంగాణ సీఎం ఉన్నారన్నారు. ఎయిర్ పోర్టు, పోర్టులను స్మగ్లింగ్ కోసం అదానీకి కట్టబెఢుతున్నారని విమర్శించారు. నరేంద్ర మోదీ వల్ల ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. ప్రధానికి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని, జగన్‌ కట్టుబానిసయ్యారని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు పిసినారి అని, ఆయన్ను తానెలా నమ్ముతానని నారాయణ వ్యాఖ్యానించారు.

                           

About Author