PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ఆచార్య’లో అవే పెండింగ్‌ అట..

1 min read

సినిమా డెస్క్​ : తండ్రీ కొడుకులు చిరు -చరణ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడింది. లాక్ డౌన్ తర్వాత ఇటీవలే తిరిగి షూటింగ్ ప్రారంభించిన చిత్ర యూనిట్.. తాజాగా షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేసినట్లు చిత్ర బృందం వెల్లడించారు. రెండు పాటల చిత్రీకరణ మాత్రమే పెండింగ్ ఉన్నట్లు ప్రకటించారు. అంతేకాదు ఈ సందర్భంగా చిరంజీవి – చరణ్ లకు సంబంధించిన ఓ పోస్టర్ ని కూడా వదిలారు. ఇందులో ఇద్దరూ నక్సలైట్ గెటప్ లో ఉండగా.. చెర్రీ భుజం పై చిరు చెయ్యి వేసి చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రామ్ చరణ్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. సోనూసూద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

About Author