PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న యువకులు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ సమక్షంలో వీరు టిడిపిలో చేరారు. వీరితో పాటు వికలాంగుల చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు మధు వైసీపీ నుండి టిడిపిలో చేరారు. ఈయనతో పాటు సభ్యులు కూడా టిడిపిలో చేరారు. టి.జి భరత్ వీరందరికీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీతోనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే వికలాంగులకు పింఛన్ పెంచేందుకు క్రుషి చేస్తానని చెప్పారు. వికలాంగుల సమస్యలను పార్టీ అధినేత చంద్రబాబు ద్రుష్టికి తీసుకెళతానని టి.జి భరత్ చెప్పారు. కర్నూల్లో తాను ఎమ్మెల్యే అయితే స్థానికంగా పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, సికిందర్, వికలాంగుల చైతన్య వేదిక సభ్యులు ఎల్లప్ప, మహేష్, అంజి, మహిళా నాయకురాలు సంజీవలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

About Author