NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మృతుల్లో 60 శాతం మంది వారే !

1 min read

పల్లెవెలుగువెబ్ : కరోన మొదటి రెండు దశలతో పోలిస్తే.. మూడో దశలో కరోన మరణాల సంఖ్య తక్కువేనని పలు నివేదికలు వెల్లడించాయి. థర్డ్ వేవ్ లో మృతి చెందిన వారిలో 60 శాతం మంది వ్యాక్సిన్లు తీసుకోని వారు లేదా ఒక్క డోసు మాత్రమే తీసుకున్నవారు అని మాక్స్ హెల్త్ కేర్ నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. మరణించిన వారిలో ఎక్కువగా 70 ఏళ్లకు పైబడిన వారేనని తెలిపింది. వీరు కూడ కరోనతో పాటు కిడ్నీ వ్యాధులు, గుండె సమస్యలు, మధుమేహం, క్యాన్సర్ వంటి సమస్యలతో బాధపడిన వారేనని నివేదిక పేర్కొంది. థర్డ్ వేవ్ దశలో 23.4 శాతం మంది మాత్రమే ఆక్సిజన్ సాయంతో చికిత్స పొందారని అధ్యయనం తెలిపింది.

       

About Author