NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నా భర్తపై తప్పుడు కేసులు పెట్టాలని చూశారు!

1 min read

-పాతింటి లక్ష్మీ, రేమడూరు గ్రామం
పల్లెవెలుగు వెబ్​ పాణ్యం: మేము వాల్మీకీలం. నా భర్తను తప్పుడు కేసుల్లో ఇరికించాలని వైసీపీ నేతలు ప్రయత్నించారు.ఐదు నెలల క్రితం నా భర్తపై వైసీపీ నేతలు తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నించారు. మా పొలంలో జింక చనిపోయింది. చనిపోయిన జింకను నా భర్త తిన్నారని, పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఊర్లోకి వచ్చి గోల చేశారు. ఆ జింకను మేము తినలేదని ఎంత మొత్తుకున్నా వినలేదు. స్టేషన్ కు తీసుకుని వెళ్లారు. అవసరమైతే పొట్ట కోసుకుని చూసుకోండని, లేదంటే డాక్టర్ల దగ్గర టెస్టులు చేయించుకునేందుకైనా సిద్ధమని గట్టిగా చెప్పడంతో వదిలేశారు.

About Author