PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దొంగ అరెస్ట్.. రూ.44,500 స్వాధీనం

1 min read

పల్లెవెలుగు వెబ్​, చెన్నూరు మండలంలోని హజ్​హౌస్​ కి ఎదురుగా ఉన్న ఓ ఫ్యాక్టరీలో చోరీకి పాల్పడిన దొంగను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక చెన్నూరు కోట్ల స్వామి వీధికి చెందిన షేక్​ గౌస్​ పీర్​ అనే వ్యక్తి వీరబ్రహ్మేంద్ర స్వామి ఐస్​ ఫ్యాక్టరీలో అనుమతి లేకుండా ప్రవేశించి.. కౌంటర్​లో ఉన్న రూ.44,500 నగదును చోరీ చేసినట్లు ఫ్యాక్టరీ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి, దొంగ కోసం గాలించగా బుడ్డాయిపల్లి గ్రామ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి వద్ద మంగళవారం సాయంత్రం అరెస్టు చేసి, అతని వద్ద ఉన్న రూ.44,500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్​ఐ శ్రీనివాస రెడ్డి వివరించారు. షేక్​ గౌస్​ పీర్​ను రిమాండ్​కు పంపారు.

About Author