NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నందికొట్కూరులో దొంగల హల్చల్.. 

1 min read

– 5 కిరాణం దుకాణాలలో చోరీ.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు పట్టణంలో దొంగలు హల్చల్ చేశారు.గురువారం తెల్లవారు జామున ఒకేరోజు నందికొట్కూరు పాత బస్టాండు సమీపంలో 5షాపుల సెట్టర్ తాళాలు పగులగొట్టి దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు.5 దుకాణాలలో దొంగలు రూ.3లక్షల విలువ చేసే కిరాణం సరుకులు, రూ.2లక్షల సిగరెట్ల బండిల్ ను ఎత్తుకెళ్లారు.  రద్దీ ప్రాంతంలో ఈ దొంగతనం జరగడంతో పట్టణ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.విషయం తెలుసుకున్న నందికొట్కూరు పోలీసులు విచారణ చేపట్టారు.

About Author