PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్మశానంలో దొంగ‌లుప‌డ్డారు..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పాట్‌లో స్మశానంలో దొంగ‌లుప‌డ్డారు. స్మశాన‌ వాటికలో నుంచి మృతుల దుస్తులు, వ‌స్తువులు దొంగ‌లించిన ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తులు..చనిపోయినవారి దుస్తులు, చీరలు, ఇతర వస్తువులను దొంగిలించార‌ని పోలీసులు తెలిపారు. బెడ్‌షీట్లు, చీరలు, చనిపోయినవారి దుస్తులు దొంగిలించార‌ని .విచార‌ణ‌లో తేలింది స్వాధీనం చేసుకున్న వస్తువులలో 520 బెడ్‌షీట్లు, 127 కుర్తాస్, 52 వైట్ చీరలు, ఇతర దుస్తులు ఉన్నాయ‌ని పోలీసులు తెలిపారు. ఈ దుస్తులను శుభ్రం చేసి, అనంతరం ఇస్త్రీ చేసి మళ్లీ విక్రయిస్తారని పోలీసు అధికారి తెలిపారు. ఈ ప్రాంతానికి చెందిన కొందరు వస్త్ర వ్యాపారులు ఈ వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఒక రోజు దోపిడీకి రూ. 300 చెల్లిస్తారని తెలిపారు. అరెస్టయిన ఏడుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ వ్యక్తులు గత 10 సంవత్సరాలుగా ఇదే పని చేస్తున్నారు. వీరి మీద దొంగ‌త‌నంతో పాటు.. అంటువ్యాధుల చట్టం క్రింద కూడా కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

About Author