PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పట్టభద్రులారా ఆలోచించండి.. టిడిపి నేతలు కొల్లు రవీంద్ర, టిజి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డిని గెలిపించాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంటు అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు టిడిపి ఇంచార్జి టిజి భరత్ ఓటర్లను కోరారు. బుధవారం నగరంలోని శంకరాస్ డిగ్రీ కళాశాలతో పాటు 45 వార్డులో పర్యటించారు. పట్టభద్రులను కలిసి టిడిపి అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో పట్టభద్రులు ఆలోచించాలని చెప్పారు. రాష్ట్రంలో అన్ని ధరలు పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. చంద్రబాబు ఒక విజన్ ఉన్న నాయకుడన్నారు. ఆయన నాయకత్వాన్ని అందరూ బలపర్చాలని కోరారు. కర్నూల్లో ఇండస్ట్రియల్ జోన్ ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వంలో పరిశ్రమలు రాలేదని వివరించారు. అందుకే పట్టభద్రులు ఆలోచించి తమ విలువైన ఓటును సద్వినియోగం చేసుకొని డెవలప్మెంట్ చేసే వ్యక్తిని గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు, టిడిపి నేతలు నాగేశ్వరరావు యాదవ్, సోమిశెట్టి నవీన్, నాగరాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

About Author