PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎవరు చిత్తశుద్ధితో పనిచేశారో ఒకసారి మీరే ఆలోచించుకోండి..

1 min read

– నంద్యాల జిల్లాలోని ప్రాజెక్టులను సందర్శించడానికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి కృతజ్ఞతలు తెలిపిన టిడిపి యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి..

పల్లెవెలుగు వెబ్ నంద్యాల:  సాగునుటి ప్రాజెక్టు సందర్శన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  పైన బురదజల్లే వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకునికి సూటిగా సమాధానంతో హెచ్చరించిన టిడిపి యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి…వైసిపి నాయకుడు మాట్లాడుతూ మన పిల్లలని మన పిల్లలు అని పిలుచుకుంటే బాగుంటుంది పక్కన ఉన్న పిల్లల్ని మన పిల్లల్ని పిలుచుకుంటే బాగుండదని కామెంట్ చేసినా వైసిపి నాకు నాయకునికి సవాల్ చేస్తూ సమాధానం చెప్పిన టిడిపి యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ముచ్చుమర్రి ,బనకచర్ల ప్రాజెక్టులకు సంబంధించి 2017 జనవరి 2 న అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  ప్రాజెక్టులు ప్రారంభించి సుమారు 549 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి 90% పనులు పూర్తి చేశారు. మరి ఇప్పుడు వచ్చిన మీ వైసీపీ ప్రభుత్వం 4 సంవత్సరము పూర్తయినా కూడా రెండు పంపులు కూడా స్టార్ట్ చేయలేకపోతున్న చేతగాని ప్రభుత్వం మీ వైసీపీ ప్రభుత్వం అని విమర్శించిన టిడిపి యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి .బనకచర్ల ప్రాజెక్టుకు నీళ్లు తీసుకొని రాగలిగితే  ఈ ప్రాజెక్టు వల్ల రాయలసీమలోని ప్రతి ఒక్క ఎకరానికి నీరు అందించని 2018 అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  ప్రారంభించారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఏ ఒక్క పని కూడా చేపట్టలేదని అన్న టిడిపి యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి.టిడిపి అధికారంలో ఉన్నప్పుడు సాగునీటి కోసం సుమారు 68,293 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని ,అలాగే త్రాగునీటి కోసం 12,440 కోట్లు రూపాయలు ఖర్చు చేసిందని మరి వైసీపీ ప్రభుత్వం వచ్చాక సాగునీటి కోసం కేవలం 22 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది, తాగునీటి కోసం రెండు వేల కోటి రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని దీన్నిబట్టి రైతుల కోసం ఎవరు చిత్తశుద్ధితో పనిచేశారో ఒకసారి మీరే ఆలోచించుకోండి అంటూ  ఎవరి పిల్లలు గురించి ఎవరు మాట్లాడతారో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని వైసిపి నాయకులకి హెచ్చరించిన టిడిపి యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి .

About Author