PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముచ్చటగా మూడోసారి.. ఎగిరేది వైయస్సార్ సిపి జెండానే

1 min read

– వైఎస్ఆర్సిపి జిల్లా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి గుమ్మల్ల సాయి కుమార్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అఖండ మెజారిటీతో కమలాపురం నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి గెలవబోతుందని, కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి హ్యాట్రిక్ సాధించబోతున్నారని వైయస్సార్సీపి జిల్లా విద్యార్థి విభాగం కార్యదర్శి గుమ్మల్ల సాయికుమార్ రెడ్డి తెలిపారు, గురువారం ఆయన చెన్నూరులో విలేకర్లతో మాట్లాడుతూ, రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో విజయ దుందుభి మోగిస్తుందని, అలాగే కమలాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ముచ్చటగా మూడోసారి విజయం సాధించబోతున్నారని ఆయన తెలిపారు, రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలే ప్రభుత్వానికి వెన్నుతన్నుగా నిలబడి, ప్రజల ఆశీస్సులతో మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారని, అలాగే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు, వైఎస్ఆర్సిపి కమలాపురం నియోజకవర్గంలోని అన్ని మండలాలలో బలమైన క్యాడర్ కలిగి ఉందని, ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల పనిచేస్తారని, ఆయన తెలియజేశారు, మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే, రాష్ట్రంలో విద్యా, వైద్యం, వ్యవసాయం, ఇంకా మెరుగుపడుతుందని ఆయన తెలిపారు.

About Author