PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈనెల 30 నుంచి 7వరకు వైశాఖ మాస తిరు కల్యాణోత్సవాలు

1 min read

– ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వైశాఖ మాస తిరు కల్యాణోత్సవాలు..
– కార్య నిర్వహణాధికారి వేoడ్ర త్రినాధరావు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వైశాఖ మాస తిరు కళ్యాణోత్సవాలు ఈనెల 30వ తేదీ నుండి మే 7వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాధరావు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ స్వామి వారి కళ్యాణం మే, 4వ తేదీ గురువారం రాత్రి 8 గంటలకు నిర్వహించడం జరుగుతుందని, శ్రీ స్వామి వారి రధోత్సవం మే, 5వ తేదీ శుక్రవారం సాయంత్రం 7 గంటలకు జరుగుతుందన్నారు. ఈనెల 30వ తేదీ నుండి మే , 7వ తేదీ వరకు నిత్యార్జిత కళ్యాణములు మరియు అన్ని ఆర్జిత సేవలు జరుపబడవని, భక్తులు గమనించాలని కోరారు. స్వామి వారి భక్తులు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వైశాఖ మాస తిరు కళ్యాణోత్సవాలలో పాల్గొని తరించాలని త్రినాధరావు విజ్ఞప్తి చేస్తూ తెలిపారు.

About Author