PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ క్రాప్ బుకింగ్ నమోదు ఖరీఫ్  ప్రారంభం…

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : ఈనెల 23 నుండి ఈ క్రాప్ బుకింగ్ మొదలవుతుందని మండల వ్యవసాయ అధికారి  హేమసుందర్ రెడ్డి తెలిపారు .  గడివేముల మండలంలోని ఇప్పటివరకు 9762 ఎకరాలలో వివిధ పంటలై న సోయాబీను ,పత్తి , వరి , మినుము , కంది , మరియు ఇతర పంటలు వేసినట్టు రైతు సోదరులందరూ ఈ సంవత్సరము ఖరీఫ్ లో  సాగు చేసినటువంటి పంటల ను తప్పనిసరిగా ఈ క్రాపు బుకింగ్  చేసుకోవాలన్నారు . ఇది 3 విడతలుగా ఉంటుందని . మొదటి విడతలో రైతుకు సంబంధించినటువంటి పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు ,1బి , ఫోన్ నెంబరు, అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి అందులో  రైతు పేరు, చిరునామా నీటి ఆధారమా వర్షాధారమా,  పంట రకము, తడి నా పొడి నా పూర్తిగా నింపి సంతకం చేసి ఇవ్వవలసిందిగా ఉంటుందన్నారు . రెండవ విడతలో ఈసారి కొత్తగా సర్వే నెంబర్లు జియో ట్యగింగ్ ద్వారా గుర్తించినట్టు కాబట్టి ప్రతి ఒక్క రైతు పంట వేసి నా ప్రతి సర్వే నెంబరును రైతు పొలం వద్దకు వ్యవసాయ శాఖ , రెవెన్యూ మరియు రైతు సమక్షంలో ఫోటో జియో కోఆర్డినేట్ ఆధారంగా పొలంలోకి ,పొలము దగ్గరికి, వెళ్తేనే ఆప్ లో ఫోటో ఓపెన్ అయ్యి ఫోటో తీసుకోవడానికి వీలు అవుతుంది .

3) మూడవ స్టెప్పులో రైతు విధిగా వేలిముద్ర వేయాలి లేదా ఫోన్ నెంబర్ కి ఆధార్ లింక్ అయిన  ఉంటే ఓటీపీ ద్వారా అయినా కూడా ఈ పనిని పూర్తి చేసుకోవచ్చని. కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ ఆర్పీకే సిబ్బందిని సంప్రదించి ఈ కాపు త్వరితగతిన పంట నమోదు నమోదు చేసుకోవాలని తెలిపారు.

About Author