PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్ర‌ధాని మోదీ రోజూవారీ ప‌ని ఇదే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతుండటంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రోజువారీ చేసే పనుల్లో ఈ ధరల పెంపకం ఓ భాగంగా మారిపోయిందని మండిపడ్డారు. RozSubahKiBaat అనే హ్యాష్‌ట్యాగ్‌తో బుధవారం ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘‘ప్రధాన మంత్రి రోజువారీ పనుల జాబితా – పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల్లో పెరుగుదల ఎంత? ప్రజల ఖర్చులపై చర్చను ఎలా ఆపాలి? యువతకు ఉద్యోగాల కల్పనపై పగటి కలలను ఏవిధంగా చూపించాలి? ఏ ప్రభుత్వ రంగ కంపెనీని అమ్మేయాలి? రైతులను మరింత నిస్సహాయులుగా చేయడం ఎలా?’’ అని పేర్కొన్నారు.

                                           

About Author