PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి : మాజీ ఎమ్మెల్యే

1 min read

– 7వ వార్డు లో కొత్తపేట కాలనీలలో 4వ రోజు ఇదేం ఖర్మ మరియు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: పట్టణం లోని ఏడవ వార్డులో తెలుగుదేశం పార్టీ శ్రీశైలం నియోజకవర్గం టిడిపి మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ‘ఇదేమి ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా శనివారం ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. టిడిపి నాయకులు రేడియం నూర్ , పాస్పుల్ మున్నా తో కలిసి పార్టీ నేతలు ఇంటింటికి తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. వైసిపి ప్రభుత్వ దోపిడీ, చేతగానీ పరిపాలన, టిడిపి విధానాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం పాలనలో వైసిపి నేతలు ఇష్టం వచ్చినట్లు ప్రజల సొమ్మును దోచుకుని తింటున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా సక్రమంగానెరవేర్చలేదన్నారు. సంక్షేమం మాటున భారీ అవినీతి జరుగుతోందన్నారు. రాష్ట్రానికి పట్టిన ఖర్మ పోవాలంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించి, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడుని గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author