NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“నన్ను స‌జీవంగా చూడ‌టం ఇదే చివ‌రిసారి కావొచ్చు“

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆదివారం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ.. అమెరికా చట్ట సభలోకి 300 మం‍ది సభ్యులతో దాదాపు గంటపాటు వీడియో కాల్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా తన ఆవేదన వ్యక్తం చేశారు. తనను సజీవంగా చూడడం ఇదే చివరిసారి కావచ్చని అన్నారు. ఇవే తన చివరి మాటలు కావొచ్చంటూ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. ఆక్రమణదారుల నుంచి తమ దేశాన్ని కాపాడుకుంటామని అన్నారు. తమ మాతృభూమిని కాపాడుకునేందుకు ఉక్రెయిన్‌ ప్రజలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నారని ప్రశంసించారు. రష్యాను అడ్డుకునేందుకు యుద్ధ విమానాలను అందించాలంటూ విజ్ఞప్తి చేశారు. అదే క్రమంలో తమ గగనతలాన్ని నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలని నాటోను మరోసారి అభ్యర్థించారు. రష్యా చమురు దిగుమతులపై కూడా ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని కోరారు.

                                                 

About Author