ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు
1 min read
ధర్మాచరణము మీదనే వ్యక్తి వికాసము- సమాజాభ్యుదయము ఆధారపడి ఉన్నవి.
డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే
ఎమ్మిగనూరు, న్యూస్ నేడు: వ్యక్తి వికాసము సమాజం మీదను, సమాజాభ్యుదయము వ్యక్తి మీదను పరస్పరం ఆధారపడి ఉన్నందున ప్రతి వ్యక్తి ధర్మాన్ని ఆచరించవలెనని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు మండలం, చల్ల కూలూరు గ్రామంలోని శివాలయం నందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్బంగా శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. గత మూడు రోజులుగా సి. తులశమ్మ చేసిన ధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండలిచే భజనలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మూలింటి శాంతమ్మ, యం.మాధవ స్వామి, మాజీ సర్పంచ్ లక్ష్మన్న, భజన మండలి అధ్యక్షులు నల్లన్న, హార్మోనిస్టు నారాయణదాసు, బి.నర్సప్ప, పెద్దయ్య స్వామి, అర్చకులు రామాంజనేయులు, రాముడు, జయ రాముడు, దామోదర్ నాయుడు, మహేశ్, వీరేశ్, కొండన్నతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.