NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన తూడి మేఘారెడ్డి

1 min read

పల్లెవెలుగు, శ్రీరంగాపురం:  మండల కేంద్రమైన శ్రీరంగాపురం కు చెందిన గుమ్మడం కిష్టమ్మ శనివారం రాత్రి అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీ రంగాపూర్ మేఘా రెడ్డి యువసేన సభ్యులు శ్రీ హరి రాజు మరియు ఆశన్న.. వనపర్తి జననేత మేఘా రెడ్డి  దృష్టికి తీసుకువచ్చారు.  స్పందించిన మేఘా రెడ్డి వెంటనే రూ. 5వేలు మేఘా రెడ్డి యువసేన బృందం చేత  బాధిత కుటుంబానికి అందజేశారు.  ఈ కార్యక్రమం లో శ్రీ రంగాపూర్ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ హరి రాజు, మండల కాంగ్రెస్ sc సెల్ ప్రధాన కార్యదర్శి J ఆశన్న, బోయ వెంకటయ్య, రాముడు,గోవింద్, భాస్కర్, కురుమూర్తి, భానుచందర్,తదితరులు పాల్గొన్నారు.

About Author