NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

న్యాయవాది పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి

1 min read

న్యాయవాది ,రైతు సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బి. సురేంద్ర కుమార్ డిమాండ్.

 పత్తికొండ , న్యూస్​ నేడు : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది గురు రాజారావు పై దాడి చేసిన దుండగుల పై హత్యాయత్నం కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలనని పత్తికొండ బార్ అసోసియేషన్ న్యాయవాది, ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం పత్తికొండ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బి. సురేంద్ర కుమార్ డిమాండ్ చేశారు.ఆదివారం పత్తికొండ లో బి. సురేంద్ర కుమార్ విలేకరులతో మాట్లాడుతూ,  మంత్రాలయం మండలం మాలపల్లి గ్రామంలో ఆదివారంనాడు ఇంటి దగ్గర  ఉన్న న్యాయవాది గురు రాజారావు పై ఉదయం 9: 00.గంటల ప్రాంతంలో మంత్రాలయం మండలం  మాజీ జడ్పీటీసీ సభ్యులు ఆర్. లక్ష్మయ్య తో పాటు మరికొంతమంది అతని అనుచరులు రాళ్లతో దాడి చేసి కొట్టి చంపేదనికి ప్రయత్నం చేసారని తెలిపారు.న్యాయవాది గురు రాజారావు పై దాడి చేయడం పిరికి పంద చర్య అని ,ఏదైనా సమస్యా ఉంటే చట్టపరంగా పోరాడాలని ఆయన అన్నారు. న్యాయవాదులు కు ప్రత్యేక  రక్షణ చట్టం అమలు చేయాలని ఆయన కోరారు.సమాజంలో బాధితుల తరుపున నిష్పక్షపాతంగా న్యాయ సేవలు అందిస్తున్న న్యాయవాదులు పై దాడులు చేసి చంపేదనికి ప్రయత్నం చేయడం హేయమైన చర్యగా ఆయన అభిప్రాయపడ్డారు.న్యాయవాది గురు రాజారావు  పై దాడి చేసిన దుండగుల తరుపు ఎవరు కేసు వదించారదని జిల్లాలోని బార్ అసోసియేషన్ లు తీర్మానాలు చేయాలని కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *