PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ్రిటీషోల్ల బూట్లు శుభ్రం చేసిన‌వారు.. దేశ‌భ‌క్తి గురించి చెబుతున్నారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బీజేపీ, న‌రేంద్ర‌మోదీ పై జ‌మ్మూక‌శ్మీర్ ముఖ్య‌మంత్రి మెహ‌బూబా ముఫ్తీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బ్రిటిషోల్ల బూట్లు శుభ్రం చేసిన వారు ఈరోజు దేశ‌భ‌క్తి గురించి లెక్చ‌ర్లు ఇస్తున్నార‌ని తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. శ్రీన‌గ‌ర్ లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆమె మాట్లాడుతూ బీజేపీని జిన్నాతో పోల్చారు. ఈ దేశ స్వాతంత్ర్యం కోసం జవహార్‌లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్ సయ్యద్ అహ్మద్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌లతో సమ పోరాటం చేసిన మహ్మద్ అలీ జిన్నాను మనం ఈరోజు విమర్శిస్తున్నాం. ఎందుకంటే ఆయన మీద ఒక ఫిర్యాదు ఉంది. దేశ విభజనకు కారకుడని ఆయనను పక్కన పెట్టేశాం. హిందూ-ముస్లింల ప్రాతిపదికన జిన్నా ఈ దేశాన్ని విడదీశారు. కానీ ఈరోజు దేశంలో జరుగుతున్నదేంటి? ఎంతో మంది జిన్నాలు ఈ దేశంలోని ప్రజలను అదే మత ప్రాతిపదికన విడదీస్తున్నారు అని ఆమె విమ‌ర్శ‌లు చేశారు.

                                        
     

About Author