NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భగవంతుని కృపలేనివారికి సుఖశాంతులు లభింపవు

1 min read

డాక్టర్ మల్లు వేంకట రెడ్డి, తితిదే

ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు

కర్నూలు, న్యూస్​ నేడు:  జీవితం శాంతియుతంగా సాగాలంటే సద్గురువును ఆశ్రయించాలని, సద్గురువును ఆశ్రయిస్తే భగవత్కృప కలుగుతుందని, భగవతుని కృపలేనివారికి సుఖశాంతులు లభింపవని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకట రెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గత ఐదు రోజులగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్బంగా గోమాతకు పూజతో పాటు ఊరేగింపు చేసి, సామూహిక కుంకుమమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిరోజు ధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండలిచే భజనలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యం.అరున్ కుమార్, ఎం.పీ.టీ.సీ సభ్యులు ఎన్.శ్రీనివాసులు, ఆలయ ధర్మ కర్త కొండగేరి శ్రీరాములు,  గ్రామ పెద్ద బోయ చెన్నప్ప, దుమ్ము వెంకటేశ్, దుమ్ము హనుమంతు, వడ్డె పులికొండ, భజన మండలి అధ్యక్షలు బాపులదొడ్డి రామచంధ్ర, హార్మోనిస్ట్ కనుకు వెంకటరాముడు, తబలిస్ట్ కురువ మురళి, గాయకులు మాల రాజు ఆలయ మీడియా ఇంచార్జ్ ఉల్లిగడ్డల దివాకర్ ప్రభుత్వ ఉపాద్యాయులు డి. మధు, శ్రీ శివయోగి సిద్దరంగ లింగేశ్వర శివాచార్య స్వాముల వారి శిష్యులు జి. లక్ష్మన్న, బి. రంగస్వామి, ఉప్పర వీర సుంకన్న, మూలగేరి నరేంద్ర, తెలుగు మద్దిలేటి, పూజారి మాదన్న, మూలింటి మాదన్నతోపాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.కార్యక్రమానికి సమన్వయకర్తగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ బూడిదిన్నె మధు వ్యవహరించారు. కార్యక్రమానంతరం భక్తాదులకు మహా ప్రసాద వితరణ చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *