NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సేవా కార్యక్రమాలు చేసే వారిని ప్రోత్సహించాలి.. టీజీ భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సమాజంలో సేవా కార్యక్రమాలు చేసే వారిని ప్రోత్సహిస్తే మరిన్ని సేవ కార్యక్రమాలు చేస్తారని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి టీజీ భరత్ అన్నారు. మహోదయ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఎదుట చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. టిజి భరత్ ముఖ్య అతిథిగా హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఏడు సంవత్సరాలుగా చలివేంద్రం ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. మహోదయ సొసైటీ ద్వారా కర్నూలు నగరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. అంతకుముందు గాంధీ విగ్రహం వద్ద టిజి భరత్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శ్రీనివాస్, సాయి దీపక్, శేషాద్రి, కార్తీక్, నరేష్, చిన్న, నారి, తదితరులు పాల్గొన్నారు.

About Author