PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంబేద్కర్ ని అవమానించిన వారిని శిక్షించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: అంబేద్కర్ ను అవమాన పరిచిన రాయలసీమ యూనివర్సిటీ సూపర్ డెంట్ ఎండి ఇస్మాయిల్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కెవిపిఎస్ జిల్లా అధ్యక్షురాలు రాష్ట్ర సహాయ కార్యదర్శి కే.రంగమ్మ, సిఐటియుసి మహిళ నాయకురాలు ఆర్ జయ రాణి , డిమాండ్ చేశారు. శుక్రవారం నందికొట్కూరు పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నతమైన హోదాలో ఉండి మద్యం మత్తులో తన తోటి విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావుతో అంబేద్కర్ ను దళితులను కించపరిచి మాట్లాడడం తగదన్నారు. ఎండి ఇస్మాయిలను, శ్రీనివాసరావును తక్షణమే ఉద్యోగం నుండి తొలగించి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జూపాడు బంగ్లా ఐద్వా షేక్ మాలానిబి, కెవిపిఎస్ దళిత మహిళా సంఘం లక్ష్మీదేవి పాల్గొన్నారు.

About Author