PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సేవ చేసే వారిని ప్రోత్సహించాలి: టిజి భరత్

1 min read

కర్నూలు:ప్రజలకు సేవ చేసే వారిని ప్రోత్సహించాలని తెలుగుదేశం పార్టీ కర్నూల్ నియోజకవర్గ ఇంచార్జి టిజి భరత్ అన్నారు. బుధవారం నగరంలోని పాత బస్టాండ్లో వాసవి ఏజెన్సీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా చలివేంద్రం ఏర్పాటు చేస్తూ ప్రజా సేవ చేస్తున్న వాసవి ఏజెన్సీస్ యాజమాన్యాన్ని అభినందించారు. సేవ చేసే వారికి అండగా ఉండి ప్రోత్సహిస్తే మరిన్ని సేవ కార్యక్రమాలు చేస్తారన్నారు. తాము కూడా కర్నూల్ నగరంలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజలకు త్రాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వాసవి ఏజెన్సీస్ అధినేత శేషఫణి, దీరేంద్ర నాథ్, టిడిపి కార్యకర్తలు, వాసవీ సేవ దళ్ సభ్యులు, ఇంజినీరింగ్ షాప్స్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

About Author