తిక్కారెడ్డి ని నమ్ముకున్న వారికి అన్యాయం జరగదు
1 min read
టిడిపి మండల అధ్యక్షులు పన్నగ వెంకటేష్ స్వామి
మంత్రాలయం , న్యూస్ నేడు : టిడిపి జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి ని నమ్ముకున్న వారికి అన్యాయం జరగదని మంచి రోజులు వచ్చే సమయం దగ్గర లోనే ఉన్నాయని అప్పుడు అందరికీ న్యాయం జరుగుతుందని మంత్రాలయం మండలం టిడిపి అధ్యక్షులు పన్నగ వెంకటేష్ స్వామి జోస్యం చెప్పారు. సోమవారం టిడిపి జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి జన్మదినం సందర్భంగా ఎమ్మిగనూరు లో తిక్కారెడ్డి నివాసంలో గజ మాలతో శాలువ కప్పి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రాలయం రాఘవేంద్ర సర్కిల్ లో బాణా సంచా కాల్చి సంబరాలతో కేకు కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిక్కారెడ్డి అంటే ఒక నమ్మకమని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడన్నారు. గత ఇరవై ఏళ్లుగా ఓకే విధంగా ఉంటూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని వెనకడుగు వేసే వ్యక్తిత్వం తనది కాదన్నారు. ఎన్ని ఒడిదడుకులు వచ్చినా అలుపెరగకుండా వీరుడిగా పోరాటం చేయడమే ఆయన నైజం అన్నారు. ఏదైన ఉంటే నిర్మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే తత్వం ఉంటుందని, విజయం అపజయంలోనూ ఒకే మాదిరిగా ఉంటారని చెప్పారు. రారాజు లాగా ఉన్నా సామాన్యుడి లాగానే అందరినీ ఆదరిస్తారని తనను నమ్మిన నాయకులు కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉన్నారంటే ఆపద్భాంధవుడిలా ఆపదలో ఆదుకునే మనస్తత్వం అన్నారు. రాజకీయాల్లో మనసుకు శరీరానికి ఎన్ని గాయాలైనా తలవంచని నాయకుడు తిక్కారెడ్డి అన్నారు. ప్రవర్తనలో నిజాయితీ, సేవలో అంకిత భావం, రాజకీయంలో నిబద్ధత, ప్రేమలో స్వచ్చత కలిగిన నిశ్వార్ధ నేత అని కొనియాడారు. జయాప జయాలను సమానంగా స్వీకరించి కొంతంత అండగా నేనున్నాను అంటూ బరోసా ధైర్యం ఇచ్చే నాయకుడైన మా రారాజు తిక్కారెడ్డి ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు రాఘవేంద్రస్వామి ఆశిస్సులతో మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిసి సెల్ జనరల్ సెక్రటరీ వట్టెప్ప నరసింహ, వట్టేప్ప చిన్న సుంకప్ప, మీడియా కోఆర్డినేటర్ విజయరామిరెడ్డి, హండె హనుమంతు, మాధవరం కృష్ణమోహన్ రెడ్డి, సంత మార్కెట్ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సున్నం గురురాజ, సున్నం రఘు, సున్నం రామకృష్ణ, వనికె నాగరాజు, ఏబు, తిక్కస్వామి, రవి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
