PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీకి మూడు రోజుల వ‌ర్ష సూచ‌న‌

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ప‌శ్చిమ‌ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడగా, దానికి అనుబంధంగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో రాగల మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని, ఇది బుధవారం నాటికి ఏపీ తీరానికి చేరువగా రావొచ్చని తెలిపింది. కోస్తాంధ్రలో పలు చోట్ల, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.

                                               

About Author