PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశైలంలో వైభ‌వంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం:  శ్రీశైలం మహాక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవం వైభవంగా జరిగింది ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీస్వామి అమ్మవార్లకు విశేష పూజాధికాలు నిర్వహించడం జరిగింది. రావణవాహనసేవలో భక్తులకు స్వామి అమ్మవార్లు దర్శనమిచ్చారు. శ్రీశైలం పురవీధులలో కన్నులపండువగా గ్రామోత్సవం నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు స్వామిఅమ్మవార్ల ఉత్తర ద్వార దర్శనం భక్తులకు లభించింది. గ్రామోత్సవం గంగాధర మండపం నుండి నందిమండపం మీదుగా బయలువీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు ఆలయ అర్చకులు ఆలయ అధికారులు పాల్గొన్నారు. 

About Author