PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

1 min read

– మరో ముగ్గురికి తీవ్రగాయాలు
పల్లెవెలుగు వెబ్​, ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ జాతీయ రహదారిలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తపల్లి గ్రామానికి చెందిన కారు ఆళ్లగడ్డ సమీపంలోని గిడ్డంగుల వద్ద టైరు పేలి.. బోల్తా కొడుతూ… డివైడర్​ అవతలి వైపు ఎదురుగా బైకును ఢీకొంది. శిరువెళ్లకు చెందిన కలాం, అబ్దుల్​, జాకీర్​, సులేమాన్​ అనే నలుగురు బోడెమ్మనూరు గ్రామంలో రేకు సెంట్రింగ్​ పని మీద వెళ్లి… తిరిగి బైకుపై వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో కలాం, అబ్దుల్​, జాకీర్​ అక్కడికక్కడే మృతి చెందారు.

సులేమాన్​కు తీవ్రగాయాలయ్యాయి. కారులో ఉన్న బాల ఈశ్వర రెడ్డి, అతడి భార్యకు తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని డీఎస్పీ రాజేంద్ర, సీఐ కృష్ణయ్య, ఎస్​ఐ సత్యనారాయణ పరిశీలించారు. క్షతగాత్రులను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సులేమాన్. బాల ఈశ్వర్ రెడ్డి, అతడి భార్యను మెరుగైన వైద్య చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


About Author