PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భిక్షాటన చేస్తే మూడు నెలల జైలు.. రూ. లక్ష జరిమానా !

1 min read

పల్లెవెలుగువెబ్ : భిక్షాటన చేసే వారిపై యూఏఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎవరైనా భిక్షాటన చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. మూడు నెలల జైలుతో పాటు రూ.1లక్ష జరిమానా ఉంటుందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. ఈ మేరకు అధికారిక సోషల్ మీడియా ఛానెల్స్ ద్వారా కీలక ప్రకటన చేసింది. భిక్షాటనకు జరిమానాపై అవగాహన కల్పించడం కోసం ఫెడరల్ డిక్రీ-లా నం. 31 ఆఫ్ 2021లోని ఆర్టికల్ 475లో నేరాలు, జరిమానాల చట్టానికి సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఫిబ్రవరి 11న తన అధికారిక సోషల్ మీడియా ఛానెల్‌లలో వివరాలను పోస్ట్ చేసింది.

              

About Author