PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ముగ్గురికి తీవ్ర గాయాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​, చాగలమర్రి: కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలోని  40 వ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక కూలూరు రస్తాలో జాతీయ రహదారిపై నెల్లూరు నుండి కర్నూలు వైపు వెళ్తున్న కారు కడప జిల్లా మైలవరం మండలం పెద్ద కొమ్మర్లకు చెందిన పద్మనాభరెడ్డి,కళావతి దంపతులు ద్విచక్ర వాహనంలో కూలూరు  రహదారి దాటుతుండగా ఢీ కొంది. ఈ ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని 108లో కడప జిల్లా ప్రొద్దుటూరు వైద్యశాలకు తరలించారు.

అలాగే రుద్రవరం మండలం నర్సాపురంకు చెందిన చిన్న ఓబులేసు మండలంలోని మల్లెవేముల గ్రామంలో జరిగిన శుభకార్యానికి తన కుమార్తె తో హజరై తిరిగి తమ స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెలుతుండగా.. పెద్దబోదనం మెట్ట వద్ద   జాతీయ రహదారిపై కుక్క అడ్డు రావడంతో అదుపు తప్పి జారీ పడింది. దీంతో గాయపడ్డ చిన్న ఓబులేసును 108 లో ఆళ్ళగడ్డ వైద్యశాలకు తరలించారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాలకు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

About Author