NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మూడేళ్ల త‌ర్వాత‌.. `నీరు-చెట్టు` బిల్లులు విడుద‌ల !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నీరు, చెట్టు పథకం కింద టీడీపీ హయాంలో చేసిన పనులకు బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రూ.170 కోట్లు విడుదల చేయాలని ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రావత్‌ కొద్ది సేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నీరు, చెట్టు పనులపై విజిలెన్స్‌ విచారణను ప్రభుత్వం చేపట్టింది. అవకతవకలు లేవని అధికారులు నిర్ధారించారు. థర్డ్‌ పార్టీ విచారణ చేయిస్తామని చెప్పడంతో ఇంజినీర్లు ఎదురు తిరిగారు. నీరు, చెట్టు పథకం కింద చేసిన పనులకు బిల్లులు ఇవ్వలేదని కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. వేసవి సెలవులు పూర్తి అయిన అనంతరం వెంటనే హైకోర్టు విచారణ చేపట్టనుంది. దీంతో ప్రభుత్వం బిల్లులను విడుదల చేసింది.

                                

About Author