PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓటిఎస్ ద్వారా .. రూ .4 లక్షల 11 వేలు రికవరీ

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది: మహానంది మండలం లో నీ గ్రామాల్లో 4,11000రూపాయలు ఓ టి ఎస్ ద్వారా 48 మంది లబ్ధిదారుల నుండి రికవరీ చేసినట్లు మహానంది మండలం ఎంపీడీవో సుబ్బరాజు తెలిపారు .గత కొన్ని సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న ప్రభుత్వం నుండి గృహ నిర్మాణాల కోసం ఆర్థిక సహాయ సహకారాలు పొందినవారు నుండి ఓ టి ఎస్ పథకం ద్వారా పైన తెలిపిన మొత్తాన్ని రికవరీ చేసినట్లు తెలిపారు .మిగతా లబ్ధిదారులకు కూడా ముందుకు వచ్చి ఓ టి ఎస్ పథకాన్ని వినియోగించుకొని సంబంధిత రిజిస్ట్రేషన్ ఫారాలు పొందవచ్చని సూచించారు . ఈ  అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఎంపీడీవో సుబ్బరాజు కోరారు.

About Author