NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పైబావి వీరారెడ్డి ని పరామర్శించిన తిక్కారెడ్డి

1 min read

మంత్రాలయం, పల్లెవెలుగు: మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు మాధవరం అమర్నాథ్ రెడ్డి తండ్రి పైబావి వీరారెడ్డి  అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులో చికిత్స నిమిత్తం ఇంటికి రావడం జరిగింది. విషయం తెలుసుకున్న మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి శుక్రవారం  మాధవరంలో వారి ఇంటి కి వెళ్లి వీరారెడ్డి ని పరామర్శించి ఆరోగ్య విషయాలు తీసుకొని ధైర్యంగా ఉండాలని సూచించారు. సరైన సమయానికి మంచి ఆహారం మందులు తీసుకోవాలని  సూచించారు. అమర్నాథ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పన్నగ వెంకటేష్ స్వామి , మాధవరం అమర్నాథ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, తెలుగు యువత జిల్లా మీడియా కోఆర్డినేటర్ విజయ రామిరెడ్డి, తెలుగు యువత మండల అధ్యక్షులు సాయికుమార్ రెడ్డి, యూనిట్ ఇంచార్జ్ జెట్టి వీరేష్, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author