PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిప్పు సుల్తాన్ ప్యాలెస్ స‌ర్వే చేయాలి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మైసూరు రాజు టిప్పు సుల్తాన్ ప్యాలెస్ స్థలంలో సర్వే చేయాలని హిందూ జన జాగృతి సమితి డిమాండ్ చేసింది. 15వ శతాబ్దంనాటి కోటే వేంకట రమణ స్వామి దేవాలయం భూములను ఆక్రమించుకుని ఈ ప్యాలెస్‌ను నిర్మించారని ఆరోపించింది. హిందూ జన జాగృతి సమితి ప్రతినిధి మోహన్ గౌడ గురువారం మాట్లాడుతూ, టిప్పు సుల్తాన్ ప్యాలెస్ స్థలంలో సర్వే చేయాలని కోరారు. కోటే వేంకట రమణ స్వామి దేవాలయం భూములను టిప్పు సుల్తాన్ ఆక్రమించుకుని ఈ ప్యాలెస్‌ను నిర్మించినట్లు అనేక మంది చెప్పారన్నారు. ఈ స్థలంలో అప్పట్లో వేదాలను బోధించేవారని చెప్పారు. ఈ భూమిని అసలు యజమానికి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.

                                            

About Author