PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టైర్ పంచ‌ర్.. బ‌స్సు బోల్తా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నెల్లూరు జిల్లా మనుబోలు బద్వేల్ క్రాస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు టైర్‌ పంచర్‌ కావడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 15 మందికి గాయాలయ్యాయి. బాధితులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన నెల్లూరు నుంచి తిరుపతికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

                                         

About Author