NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అర్హులైన వారందరికీ.. పథకాలు వర్తింపజేయండి

1 min read

– వైఎస్ఆర్ క్రాంతి పథకం పీడీ వెంకటేశ్వర్లు
పల్లెవెలుగు వెబ్​, మహానంది: నిస్పక్షపాతంగా పనిచేయాలని వైఎస్ఆర్ క్రాంతి పథకంప్రాజెక్టు డైరెక్టర్ పి.డి వెంకటేశ్వర్లు అధికారులను కోరారు.
మహానంది మండలం బుక్కాపురం పొదుపు భవనం నందు మహానంది, బండి ఆత్మకూరు,గడివేముల, పాణ్యం ఇతర మండలాలకు సంబంధించిన ఏబీఎన్ లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న తోడు, జగనన్న ఆసరా తదితర సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట ఏ పి డి శ్రీధర్ రెడ్డి ,లక్ష్మయ్య మహానంది ఏపీఎం తిరుపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహానందిలో పూజలు: మహానంది క్షేత్రం లో వైయస్సార్ క్రాంతి పథకం డైరెక్టర్ బి కే వెంకటేశ్వర్లు పూజలు నిర్వహించారు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు ..ఆలయ అధికారులు పూజా కార్యక్రమాల కంటే ముందు స్వాగతం పలికి కార్యక్రమాల అనంతరం దృశ్యాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆయన వెంటఏపీ డి శ్రీధర్ రెడ్డి, లక్ష్మయ్య మహానంది ఏపీఎం తిరుపాల్రెడ్డి తదితరులుపూజా కార్యక్రమాలు పాల్గొన్నారు.

About Author