PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సాయుధ దళాల కుటుంబాల సంక్షేమానికి సహకరించాలి

1 min read

: జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య

పల్లెవెలుగు వెబ్ కర్నూలు  : దేశ రక్షణకు నిరంతర సేవలు అందిస్తూ యుద్ధంలో మరణించిన, పదవి విరమణ గావించిన సాయుధ దళాల కుటుంబాల సంక్షేమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో స్పందన కార్యక్రమం అనంతరంత్రిసాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా  సాయుధ దళాల పతాక స్టిక్కర్స్ మరియు కార్ గ్లాగ్స్ ను జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ త్రిసాయుధ దళాల సేవలు కీలకమని, దేశ సేవలో వీర జవానుల సేవలు మరువలేనివన్నారు. ప్రతి ఏడాది డిసెంబర్ 7వ తేదీన దేశవ్యాప్తంగా సాయుధ దళాల పతాక దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రత్యేక నిధికి విరివిగా విరాళాలు అందించాలన్నారు. సాయుధ దళాల కుటుంబాలను ఆదుకునేందుకు అధికారులు సిబ్బంది విరాళాలు అందించాలన్నారు.కార్యక్రమంలో జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారి రత్న రూత్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Author