NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహాత్మగాంధీకి..ఘననివాళి

1 min read

పల్లెవెలుగు వెబ్: మిడుతూరు మండలంలో జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. కడుమూరు సచివాలయంలో ఉపాధి హామీ పథకం అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ బాలాజీ నాయక్,ఏపీఓ జయంతి మరియు సిబ్బంది గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. మండలంలోని వివిధ గ్రామ పంచాయితీలలో ఆయా గ్రామాల సర్పంచులు మరియు పంచాయతీ కార్యదర్శులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు మాలలు వేస్తూ గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు.అంతే కాకుండా గాంధీజీ సేవలను కొనియాడారు.ఈకార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు మరియు పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author