PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రేమ‌ను నిరూపించుకునేందుకు.. హెచ్ఐవీ ర‌క్తం ఎక్కించుకుంది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అస్సాం సువాల్కుచీకి చెందిన ఓ టీనేజర్‌‌కి సత్దోలా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో మూడేళ్ల కిందట ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం అయ్యింది. ఈ మూడేళ్లలో వాళ్ల స్నేహం.. ప్రేమగా ఎదిగింది. కలిసి జీవిద్దాం అనుకుని ఫిక్స్‌ అయిపోయారు. ప్రియుడికి హెచ్‌ఐవీ ఉందని తెలిసి కూడా ఆమె జీవించడానికి ఒప్పుకుంది. ఈ క్రమంలో పెద్దలకు విషయం చెబితే.. ఆమెను చితకబాదారు. ఇద్దరు రెండుమూడుసార్లు ఇంటి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు కూడా. కానీ, ఈ పెద్దోలున్నారే.. లాక్కొచ్చి ఇంట్లో పడేశారు. ఇక లాభం లేదనుకుని తన ట్రూ లవ్‌ను నిరూపించుకునేందుకు పెద్ద సాహసమే చేసింది. ప్రియుడి హెచ్‌ఐవీ రక్తాన్ని ఓ సిరంజీ ద్వారా సేకరించి తన నరాల్లోకి ఎక్కించుకుంది ఆమె. ప్రాణాలకు తెగించి ఆమె చేసిన షాకింగ్‌ పని.. స్థానికంగా అందరినీ విస్మయానికి గురి చేసింది. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందిస్తున్నారు.

                                            

About Author