PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని.. ఎన్​బీసీవీఎస్​ ధర్నా

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ మంగళవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. విద్యార్థి సంఘం అధ్యక్షుడు నాగరాజు, రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్​, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వై. నాగేశ్వరావు యాదవ్ మాట్లాడుతూ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు బీసీ విద్యార్థుల సంక్షేమం పట్టదా.. అని ప్రశ్నించారు. ఒక వార్డెన్​ మూడు నుంచి ఐదు హాస్టళ్లకు ఇన్​చార్జ్​గా నియమించారని, దీంతో పిల్లలను వారు ఎలా కంట్రోల్​ చేస్తూ మంచి విద్యను ఎలా అందిస్తారన్నారు. ప్రతిహాస్టల్​కు రెగ్యులర్​ వార్డెన్​ను నియమించాలని, వసతి గృహాలలో సౌకర్యాలు కల్పించాలని, బీసీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. బీసీ విద్యార్థుల కోసం రూ. 5 కోట్లతో నిర్మించే భవనం పునాదులకే పరిమితమైందని, వెంటనే పున: నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు.

About Author