PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సేవకురాలికి.. ఘనసన్మానం

1 min read

పపల్లెవెలుగు వెబ్​, ఎమ్మిగనూరు: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ.. సేవలు అందిస్తున్న ఎమ్మిగనూరు 34వ వార్డు కౌన్సిలర్​ విశ్వనాథ్​ పద్మావతిని, పట్టణ పద్మశాలి బహు ఉత్తమ సంఘం అధ్యక్షుడు విశ్వనాథ్ రమేష్ ను ఘనంగా సన్మానించారు పిరమిడ్ గౌరవ అధ్యక్షులు కె.ఆర్ రాఘవ రెడ్డి, అధ్యక్షులు కే పి ఈరన్న శెట్టి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బి శ్రీనివాసులు. ఎమ్మిగనూరు శ్రీ గురురాఘవేంద్ర మందిరంలో ఆదివారం జరిగిన సన్మాన కార్యక్రమంలో ఈరన్న శెట్టి మాట్లాడుతూ పిరమిడ్​ సెక్రటరిగా రమేష్​ చాలా అభివృద్ధి చేశారని, బుద్ధుని విగ్రహం, హాల్​లో గ్రానైట్​ ఏర్పాటుతోపాటు సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు.

మొదటిసారిగా పద్మశాలి పట్టణ బహు ఉత్తమ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన రమేష్​ను, ఆయన తల్లి కౌన్సిలర్​ విశ్వనాథ్​ పద్మావతిని సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో పిరమిడ్​ సభ్యులు, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.

About Author