NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మేయర్​ బీవై రామయ్యను సన్మానిస్తున్న సభ్యలు

మేయర్​ బీవై రామయ్యను సన్మానిస్తున్న సభ్యలు

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: ప్రజా సంక్షేమం, నగర అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న కర్నూలు నగర మేయర్​ బీవై రామయ్యను ఆదివారం మేముసైతం స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఘనంగా సన్మానించారు. మేయర్​గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నగర పర్యటన చేస్తూ.. అభివృద్ధి పనులు దగ్గరుండి చేయిస్తున్న బీవై రామయ్యకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆదివారం నగరంలోని ఓ ఫంక్షన్ హాల్​లో జరిగిన సన్మాన కార్యక్రమంలో మేయర్​ రామయ్య మాట్లాడుతూ నగర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నామని, ఇందుకు స్వచ్ఛంద సంస్థలు, అన్ని రాజకీయ పార్టీలు, వ్యాపారులు, ఉద్యోగులు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో బుట్టా ఫౌండేషన్ చైర్మన్ బుట్టా నీలకంఠ, యువ పారిశ్రామిక వేత్త టి.జి.భారత్ తదితరులు పాల్గొన్నారు.

About Author