PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ‌స్సు ప్ర‌మాద బాధితుల‌కు… ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించిన సీఎం జ‌గ‌న్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : చిత్తూరు జిల్లా బాకరాపేట బస్సుప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

చంద్ర‌బాబు దిగ్బ్రాంతి :
ప్రమాదంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లోయలో బస్సు బోల్తా పడి 8 మంది ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు. పెళ్ళింట్లో జరిగిన ప్రమాదం ఆ కుటుంబం లో తీవ్ర విషాదం నింపిందని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

                                      

About Author