PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ కార్యకర్తకు.. మెరుగైన వైద్యం అందించండి: ఎమ్మెల్యే కాటసాని

1 min read

పల్లెవెలుగు వెబ్, గడివేముల: మండల కేంద్రమైన గడివేములలోని 1వ వార్డు మెంబరు, వైసీపీ కార్యకర్త నబిరసూల్​ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ… కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పాణ్యంఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్​ రెడ్డి ఆదివారం నబి రసూల్​ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి, వైద్య చికిత్సలపై ఆరా తీశారు. నబిరసూల్​కు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్​ డా. నరేందరనాథ్​ రెడ్డికి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్​ రెడ్డి సూచించారు. ఎమ్మెల్యే వెంట జెడ్పీటీసీ ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు.

About Author