PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాడు- నేడు పనుల పరిశీలించిన ప్రత్యేకాధికారి

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: రాయచోటి నియోజకవర్గంలో ని సంబేపల్లిమండలంలో 16 పాఠశాలలలో జరిగిన నాడు నేడు పనులను ప్రత్యేక అధికారి ఎస్. మని మంగళవారం ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహా రెడ్డి తో కలిసి పరిశీలించారు. P.N.కాలనీ, సంబేపల్లి ,దేవపట్ల, బోయపల్లిలలోని ప్రాథమిక పాఠశాలలలో మరుగుదొడ్లు, తాగునీరు, మేజర్ అండ్ మైనర్ రిపేర్లు, విద్యుదీకరణ ,పెయింటింగ్ , ఫర్నిచర్ నందు జరిగిన పనులలో నాణ్యత ను పరిశీలించడం జరిగింది . జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు సుందరీకరణ లో పాఠశాల నందు భాగంగా మొక్కలు నాటాలని సూచించారు. మరమ్మతులకు వీలులేని ఫర్నిచర్​ పాఠశాలలో ఉంచరాదన్నారు. పాఠశాల నాడు నేడు ఫోటోలతో కూడిన ఆల్బమ్ ను పాఠశాలనందు ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, సీఆర్పీ నరేంద్ర, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు .

About Author