PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కలిసికట్టుగా.. కరోనా​ను తరిమికొడదాం..

1 min read

–‘ ఫీవర్​ సర్వే’ వివరాలు ప్రజాప్రతినిధులకు పంపండి..
– బిచ్చగాళ్లకు, అనాథలకు భోజనం పెట్టండి
– నిధులు నేను సమకూరుస్తా..
– రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్
పల్లెవెలుగు వెబ్​, మహబూబ్​నగర్​ : అధికారులు, ప్రజాప్రతినిధులు..సమన్వయంతో పని చేసి.. కరోనాను తరిమికొడదామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ నుంచి ఉమ్మడి మహబూబ్​ నగర్​ జిల్లాలోని మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల జెడ్పీ చైర్మన్ లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు,జిల్లా కలెక్టర్లు,ఎస్పి లు, షాద్నగర్ అధికారులతో జూమ్​ యాప్​ ద్వారా వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. లాక్​డౌన్​ను పూర్తిస్థాయిలో అమలుచేయాలని, కర్ఫ్యూ సమయంలో నిత్యాసర సరుకులకు ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని పోలీసు, జిల్లా అధికారులను ఆదేశించారు.
ఆక్సిజన్​.. అవసరం : ప్రైవేట్​ ఆస్పత్రల్లోనూ ఆక్సిజన్​, రెమిడెసివర్​ ఇంజక్షన్లు సిద్ధంగా ఉండాలని, అవసరం ఉంటేనే వాటిని వినియోగించాలని మంత్రి శ్రీనివాస గౌడ్​ సూచించారు. గ్రామంలో పది మందికి కరోనా సోకితే.. అక్కడికే వైద్యులను పంపాలన్నారు. మహబూబ్​నగర్​ జిల్లా ఆస్పత్రిలో రెండు రోజుల్లో 500 పడకల కరోనా వార్దు సిద్ధం చేస్తున్నారని, ఎస్వీఎస్​లో వంద పడకల ఐసోలేషన్​ బెడ్లు, షాద్​నగర్​లో 30 పడకల ఆక్సిజన్​తో కూడిన బెడ్లు సిద్ధమవుతున్నాయన్నారు. బిచ్ఛగాళ్లకు కేర్​ సెంటర్ ఏర్పాటు చేసి భోజనం ఏర్పాటు చేయాలని, అలాగే జిల్లా ఆస్పత్రి ఆవరణలో రోగుల సహాయకులకు భోజనం ఏర్పాటు చేయాలన్నారు. అందుకు అవసరమైన నిధులు తానే సమకూరుస్తానని మంత్రి శ్రీనివాస గౌడ్​ హామీ ఇచ్చారు. అదేవిధంగా వీసీలో జెడ్పీ చైర్​ పర్సన్​ స్వర్ణ సుధాకర్​ రెడ్డి, మహబూబ్​నగర్​ ఎంపీ మన్నే శ్రీనివాస రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్లు, కొడంగల్​ ఎమ్మెల్యే నరేందర్​ రెడ్డి, నారాయణపేట శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా మహబూబ్​నగర్​ ఎస్పీ ఆర్​. వెంకటేశ్వర్లు, నారాయణ పేట ఎస్పీ పి. చేతన, నారాయణపేట జిల్లా కలెక్టర్​ హరిచందన, షాడ్ నగర్ అనపు కలెక్టర్ .. లాక్​డౌన్​ అమలు, కర్ఫ్యూ సమయంలో ప్రజలకు , కరోనా పేషెంట్లకు చేస్తున్న సేవలు తదితర అంశాలను మంత్రికి క్షుణ్ణంగా వివరించారు . వీసీలో
మహబూబ్ నగర్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ,అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ ,నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, ఇతర అధికారులు, పోలీస్ అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.

About Author