PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్నికల ఫిర్యాదుల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు..

1 min read

జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్ కిషోర్

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో:  ఎన్నికల ఫిర్యాదుల కొరకు  ఏర్పాటు చేయబోయే టోల్ ఫ్రీ నంబరును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్ కిషోర్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం  సాధారణ ఎన్నికలు – 2024 కు సంబంధించి ఫిర్యాదుల కొరకు రాయచోటి కలెక్టరేట్లో ఏర్పాటు చేయబోయే టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు సంబంధించిన పోస్టర్ ను జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్ కిషోర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ…. రాష్ట్రంలో త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికలకు సంబంధించి భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు  చేయబోతున్నామని, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి, ఎటువంటి ఫిర్యాదు నైనా ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె ఆర్డిఓ హరిప్రసాద్, ఏడి మార్కెటింగ్ త్యాగరాజు, పిడి డిఆర్డిఏ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

About Author